మంత్రి ఎర్రబెల్లి కాన్వాయ్‌కి ప్రమాదం.. ఇద్దరికి గాయాలు

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాన్వాయ్ కి శుక్రవారం ప్రమాదం జరిగింది. అసెంబ్లీ సమావేశాలకు వరంగల్ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు. ఈ క్రమంలో రాయగిరీ సమీపంలో ఆయన కాన్వయ్‌లోని పైలెట్ వాహనానికి ప్రమాదం జరిగింది. కాన్వాయ్ వాహనాలు ఒకే సారిగా ఎడమ వైపు తిరగడంతో వెనుక వస్తోన్న ద్విచక్ర వాహనదారులు స్పీడ్‌ని కంట్రోల్ చేయలేకపోయారు. ఈక్రమంలో పైలెట్ వాహనాన్ని ఢీ కొట్టారు. దీంతో అప్రమత్తమైన మంత్రి […]

Update: 2021-09-24 01:08 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాన్వాయ్ కి శుక్రవారం ప్రమాదం జరిగింది. అసెంబ్లీ సమావేశాలకు వరంగల్ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు. ఈ క్రమంలో రాయగిరీ సమీపంలో ఆయన కాన్వయ్‌లోని పైలెట్ వాహనానికి ప్రమాదం జరిగింది. కాన్వాయ్ వాహనాలు ఒకే సారిగా ఎడమ వైపు తిరగడంతో వెనుక వస్తోన్న ద్విచక్ర వాహనదారులు స్పీడ్‌ని కంట్రోల్ చేయలేకపోయారు. ఈక్రమంలో పైలెట్ వాహనాన్ని ఢీ కొట్టారు. దీంతో అప్రమత్తమైన మంత్రి దయాకర్ రావు గాయపడిన ఇద్దరినీ కాన్వాయ్ లోని ఓ వాహనంలో హైదరాబాద్‌లోని యశోదా ఆసుపత్రికి తరలించారు.

 

Tags:    

Similar News