బిగ్ సర్‌ప్రైజ్.. సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘గంగం గణేశా’.. ఎందులో స్ట్రీమింగ్ కానుందంటే?

టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ‘దొరసాని’ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు.

Update: 2024-06-20 05:00 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ‘దొరసాని’ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ పెద్దగా విజయం కాకపోవడంతో.. ఫేమ్ రాలేదు. ఆ తర్వాత పలు సినిమాలు చేసినప్పటికీ క్రేజ్ రాలేదు. గత ఏడాది ‘బేబీ’ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆనంద్ దేవరకొండ ఓవర్ నైట్ అయిపోయాడు. అదే ఫామ్‌తో ఆనంద్ ఉదయ్ బొమ్మిశెట్టి డైరెక్షన్‌లో ‘గంగం గణేశా’ మూవీ చేశాడు. ఇందులో ప్రగతి అవాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించారు.

ఈ మూవీ మే 31న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడవుతుందా అని సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, గంగం గణేశా ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండా ఓటీటీలో రాబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రం డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకోగా.. ఎలాంటి హడావుడి లేకుండా స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. జూన్ 20 అర్థరాత్రి నుంచి అందుబాటులోకి రానున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ విషయం తెలిసిన ఆనంద్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Similar News