ఓటీటీలోకి వచ్చేస్తున్న సోనియా శశిమధనం..

ప్రస్తుతం చాలా మంది ఇంట్లో కూర్చొని ఓటీటీ సినిమాలు చూడటానికే ఇష్టపడుతున్నారు

Update: 2024-06-30 03:54 GMT

దిశ, సినిమా: ప్రస్తుతం చాలా మంది ఇంట్లో కూర్చొని ఓటీటీ సినిమాలు చూడటానికే ఇష్టపడుతున్నారు. స్టార్ హీరోస్ మూవీలు తప్ప ఎవరూ థియేటర్ కి వెళ్లి సినిమాలు చూడటమే మానేశారు. సినీ ప్రేమికులు కూడా హారర్ , థ్రిల్లర్ కంటెంట్ కోసం తెగ వెతికేస్తున్నారు. మరి కొందరు రొమాంటిక్ కామెడీ సిరీస్‌లపై ఆసక్తి చూపుతున్నారు. తాజాగా అలాంటి సిరీస్ నే స్ట్రీమింగ్ అవ్వడానికి రెడీగా ఉంది.

అదే శశిమథనం. బుల్లితెరపై తనదైన కామెడీతో అలరించిన సోనియా సింగ్‌తో పాటు పవన్ సిద్ధు, కీర్తి, రూపలక్ష్మి, కృతిక, అశోక్ చంద్ర, కేశవ్ దీపక్, అవంతి దీపక్, శ్రీలలిత పమిడిపాటి తదితరులు నటించారు. రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్‌కి వినోద్ ఘాలి దర్శకుడు.తాజాగా విడుదలైన ఈ సిరీస్ టీజర్ అందర్ని మెప్పించింది. శిమథనం సిరీస్‌ ట్రైలర్‌ అయితే చెప్పాల్సిన అవసరమే లేదు.. నవ్వులు పూయించింది. చూడబోతుంటే ఈ సిరీస్ పెద్ద హిట్ అందుకునేలా ఉంది.

శశిమధనం వెబ్ సిరీస్ జూలై 4 నుండి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్‌లో ప్రసారం చేయడానికి అందుబాటులో ఉండనుంది. “దాగుడు మూతలు దండాకోర్‌! ఎక్కడి ప్రేమికులు అక్కడే గప్‌చుప్‌!” అంటూ ట్విట్టర్ వేదికగా రిలీజ్ డేట్ ను ప్రకటించింది ఈటీవీ విన్. సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన విరాట పర్వం మూవీతో తెలుగు వారితో మంచి మార్కులు వేపించుకుంది. కెరియర్ మొదట్లో యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ చేసిన సోనియా.. విరాటపర్వం మూవీతో నటిగా మంచి పేరు సంపాదించుకుంది.

Similar News