IPL 2025 : ఆ రూల్‌ను అతిక్రమించిన ఇషాంత్ శర్మ.. భారీ జరిమానా విధించిన ఐపీఎల్

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బౌలర్ ఇషాంత్ శర్మ ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించాడు.

Update: 2025-04-07 12:55 GMT

దిశ, స్పోర్ట్స్ : సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బౌలర్ ఇషాంత్ శర్మ ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ నిర్వాహకులు అతనిపై క్రమశిక్షణా చర్యలు చేపట్టారు. ఇషాంత్ మ్యాచ్‌లో 25 శాతం జరిమానాగా విధించారు. అలాగే, ఓ డీమెరిట్ పాయింట్ కేటాయించారు. ఈ విషయాన్ని ఐపీఎల్ సోమవారం తెలిపింది. హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఇషాంత్ ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్టర్‌లోని ఆర్టికల్ 2.2 ప్రకారం లెవల్ 1 నేరానికి పాల్పడ్డాడు. మ్యాచ్ సమయంలో క్రికెట్ పరికరాలు, దుస్తులు, గ్రౌండ్ పరికరాలను దుర్వినియోగం చేయడం ఆర్టికల్ 2.2 నిబంధన ప్రకారం నేరం. ఈ నేరాన్ని ఇషాంత్ అంగీకరించడంతో ఐపీఎల్ నిర్వాహకులు అతనికి ఫైన్ విధించారు. ఈ సీజన్‌లో ఇషాంత్ పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. ధారాళంగా పరుగులు ఇస్తున్నాడు. మూడు మ్యాచ్‌ల్లో ఒక్క వికెటే తీసి 97 రన్స్ సమర్పించుకున్నాడు. హైదరాబాద్‌తో మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన అతను ఒక్క వికెట్ కూడా తీయకుండా 53 పరుగులు ఇవ్వడం గమనార్హం.


Tags:    

Similar News