సింగరేణి కార్మికుడి అనుమానస్పద మృతి

మంచిర్యాల జిల్లాలో సింగరేణి గనిలో కార్మికుడు మృతి చెందారు.

Update: 2024-09-10 15:47 GMT

దిశ, వెబ్ డెస్క్: మంచిర్యాల జిల్లాలో సింగరేణి గనిలో కార్మికుడు మృతి చెందారు. కాగా మృతుడిని శ్రీరాంపూర్‌లోని ఇందారం గనిలో.. జనరల్ మజ్దూర్‌ శ్రీనివాస్‌ గా తెలిపారు. కాగా ఆయన మృతి ప్రస్తుతం అనుమానస్పదం అయింది. వెంటిలేషన్ లేక చనిపోయాడని తోటి కార్మికులు ఆరోపిస్తుండగా.. గనిలో ఫిట్స్‌ రావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడని అధికారులు చెప్పుకొస్తున్నారు. కార్మికుని మృతి కారణంగా ప్రస్తుతం ఆయన కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి. కాగా కార్మికుడు శ్రీనివాస్ మృతికి కారణం పోస్టుమార్టం చేస్తే గాని తెలియని పరిస్థితి నెలకొంది.


Similar News