Woman die : డాక్టర్స్ అకాడమీలో కరెంట్ షాక్ తో మహిళ మృతి

ఖమ్మం నగరంలోని ఎన్టీఆర్ సర్కిల్ బైపాస్ రోడ్డు బ్యాంక్ కాలనీలో ఉన్న డాక్టర్స్ మెడికల్ అకాడమీ కోచింగ్ సెంటర్లో విద్యుత్ షాక్ కు గురై 26 ఏళ్ల మహిళ మృతి చెందింది.

Update: 2024-08-03 15:49 GMT

దిశ, ఖమ్మం సిటీ : ఖమ్మం నగరంలోని ఎన్టీఆర్ సర్కిల్ బైపాస్ రోడ్డు బ్యాంక్ కాలనీలో ఉన్న డాక్టర్స్ మెడికల్ అకాడమీ కోచింగ్ సెంటర్లో విద్యుత్ షాక్ కు గురై 26 ఏళ్ల మహిళ మృతి చెందింది. ఖమ్మం టూ టౌన్ సీఐ బి. బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం అంజలిపురం గ్రామానికి చెందిన గోటం నాగలక్ష్మి(26) ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురైనట్టు తెలిపారు. భర్త నాగయ్య తో కలిసి గత 5 సంవత్సరాలుగా డాక్టర్ అకాడమీలో  వంట పనిచేస్తూ క్యాంపస్ లో ఉండేవారని,

    ఈ క్రమంలో రూమ్స్ కి సంబంధించిన తాళపు చెవులను గ్రౌండ్ ఫ్లోర్ లో నుంచి పై ఫ్లోర్ లో ఉన్న మరో మహిళకు తాళపు చెవుల గుత్తిని పైకి విసరగా పక్కనే ఉన్న విద్యుత్ తీగలపై పడటంతో నాగలక్ష్మి దానిని తీసే ప్రయత్నం చేయగా కరెంట్ షాక్ కు గురైందని, ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించినా ప్రయోజనం లేకుండా పోయిందని తెలిపారు. ఆమె భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బాలకృష్ణ తెలిపారు.   

Tags:    

Similar News