ఘోర ప్రమాదం..కారు టైరు పంక్చర్‌ చేస్తుండగా మరో వాహనం ఢీ .. ఇద్దరు మృతి

పల్నాడు (Palnadu District) జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఈ రోజు (ఆదివారం) జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident) ఇద్దరు మృతి చెందారు.

Update: 2024-09-15 09:49 GMT

దిశ,వెబ్‌డెస్క్: పల్నాడు (Palnadu District) జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఈ రోజు (ఆదివారం) జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident) ఇద్దరు మృతి చెందారు. జిల్లాలోని యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద నెల్లూరు నుంచి కాకినాడకు వెళ్తుండగా కారు పంక్చర్‌ అయ్యింది. టైరు మారుస్తుండగా గుర్తు తెలియని వాహనం వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నిడమర్రుకు చెందిన ఇద్దరు మృతి చెందారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు(police) ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు(Registration of case) చేసుకున్నారు. మృతుల వివరాల కోసం ఆరా తీస్తున్నారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు పోలీసులు పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను సేకరిస్తున్నారు. ఈక్రమంలో మృతదేహాలను(Dead bodies) ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


Similar News