గణేశ్‌ నిమజ్జనంలో అపశ్రుతి..

సదాశివపేట మండలం నాగ్సన్ పల్లిలో గణేష్ నిమజ్జనం చేస్తున్న సమయంలో వ్యక్తి గల్లంతై మృతి చెందాడు.

Update: 2024-09-16 09:16 GMT

దిశ, సదాశివపేట : సదాశివపేట మండలం నాగ్సన్ పల్లిలో గణేష్ నిమజ్జనం చేస్తున్న సమయంలో వ్యక్తి గల్లంతై మృతి చెందాడు. ఈ విషాద ఘటన ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకెళితే నాగ్సన్ పల్లి సమీపంలో కందకుంట చెరువులో సత్తయ్య (37) అనే వ్యక్తి గల్లంతయ్యాడు. కాగా సోమవారం వ్యక్తి వివరాలను దర్యాప్తు చేసి గల్లంతైన వ్యక్తి కోసం పోలీసులు చెరువులో ముమ్మరంగా గాలించి వ్యక్తి మృతదేహాన్ని వెలికి తీశారు.


Similar News