పశువుల కోసం వంకలో దిగిన యువకుడు అదృశ్యం

వైయస్సార్ జిల్లా మైదుకూరు మండలం శివపురం దళితవాడకు చెందిన ఓబయ్య కుమారుడు గారెల నరసింహ(17) పశువులను తోలుకొచ్చేందుకు వెళ్లి వంకలో అదృశ్యమైనట్టు గ్రామస్తులు తెలిపారు.

Update: 2024-09-15 13:15 GMT

దిశ, కడప:వైయస్సార్ జిల్లా మైదుకూరు మండలం శివపురం దళితవాడకు చెందిన ఓబయ్య కుమారుడు గారెల నరసింహ(17) పశువులను తోలుకొచ్చేందుకు వెళ్లి వంకలో అదృశ్యమైనట్టు గ్రామస్తులు తెలిపారు. నరసింహ పుట్టుకతో కాలు, చేయి పనిచేయని వికలాంగుడని తెలిపారు. శనివారం సాయంత్రం పొలాల్లో మేతకు వెళ్ళిన పశువులను తీసుకొచ్చేందుకు వెళ్లివంకలో దిగడం వలన బురదలో కూరుకుపోయి మృత్యువాత పడి ఉంటారని స్థానికుల భావిస్తున్నారు. నరసింహులు అదృశ్యంపై పోలీసులు విచారణ చేపట్టారు.


Similar News