దొంగతనాలకు పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్

వరుస దొంగతనాలు చేసే నిందితుడిని అరెస్టు చేసి గురువారం రిమాండ్ కు పంపారు.

Update: 2024-09-05 13:39 GMT

దిశ, కొండాపూర్ : వరుస దొంగతనాలు చేసే నిందితుడిని అరెస్టు చేసి గురువారం రిమాండ్ కు పంపారు. కొండాపూర్ పోలీస్ స్టేషన్లో పత్రికా సమావేశం ఏర్పాటు చేసి సీఐ చంద్రయ్య మాట్లాడుతూ నిందితుడు సన్నిధి ఆంజనేయులు సూర్యాపేట జిల్లా, హుజూర్నగర్ మండలం,కరక్కాయల గూడెంకు చెందిన వ్యక్తి. ఇతను కూలి పనితో పాటు తాపీ మేస్త్రిగా పని చేస్తున్నాడు. ఈ నిందితుడు పగలు తాళం వేసిన ఇళ్లను చూసి రాత్రిపూట ఆ ఇళ్లలో దొంగతనం చేసేవాడు.

     ఇంటి బయట పార్క్ చేసిన బైక్ లను దొంగతనం చేస్తాడు. వాటిని అమ్మి వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తారు. సీఐ చంద్రయ్య, ఎస్సై హరి శంకర్ గౌడ్ కలిసి చాకచక్యంగా నిందితుడిని మల్కాపూర్ చౌరస్తా వద్ద పట్టుకున్నారు. ఇక్కడ వెహికల్ చెకింగ్ చేస్తుండగా అరెస్ట్ చేసి గురువారం రిమాండ్ కు తరలించారు. అతని నుండి 15.8 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న 18 మంది సిబ్బందికి నగదు రివార్డు అందజేశారు.

Tags:    

Similar News