క్షణికావేశంలో భార్యను హతమార్చిన భర్త

మద్యం మత్తులో ఓ భర్త తన భార్యతో గొడవపడి క్షణికావేశంలో ఆమెను చంపేశాడు.

Update: 2024-09-17 09:13 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : మద్యం మత్తులో ఓ భర్త తన భార్యతో గొడవపడి క్షణికావేశంలో ఆమెను చంపేశాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. వర్ని మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన పెంటవ్వ (46), భర్త బాలయ్యల మధ్య సోమవారం రాత్రి గొడవ జరిగింది. చిన్నగా మొదలైన గొడవ పెద్దదిగా మారింది. దీంతో అప్పటికే మద్యం మత్తులో ఉన్న బాలయ్య ఆవేశంతో కొడవలి తీసుకొని భార్య మెడపై వేటు వేశాడు. దాంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కృష్ణ తెలిపారు.   

Tags:    

Similar News