తల్లిదండ్రులు మందలించారని బాలిక ఆత్మహత్య

తల్లిదండ్రులు మందలించారని బాలిక ఆత్మహత్య చేసుకుంది.

Update: 2024-09-06 13:32 GMT

దిశ, శేరిలింగంపల్లి : తల్లిదండ్రులు మందలించారని బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హెచ్ఎంటీ కాలనీలో శుక్రవారం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ కుటుంబం బతుకుదెరువు నిమిత్తం గత ఏడాది నగరానికి వలసవచ్చి మియాపూర్ డివిజన్ లోని హెచ్ ఎంటీ కాలనీలో నివాసం ఉంటూ ఇళ్లలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారి కూతురు (17) చదువుకోకుండా ఇంటి వద్దనే ఉంటుంది.

    కుటుంబ కలహాల నేపథ్యంలో తలిదండ్రులు మందలించారు. మనస్థాపానికి గురైన బాలిక శుక్రవారం మధ్యాహ్నం సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. బాలిక ఉరివేసుకున్న విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే దగ్గరలోని హాస్పటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న మియాపూర్ పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Tags:    

Similar News