లారీని వెనుక నుంచి ఢీకొట్టిన బైక్...యువకుడు స్పాట్ డెడ్

లారీని వెనుక నుంచి ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో యువకుడు మృతి చెందిన సంఘటన కోదాడ మండల పరిధిలోని ఎర్రవరం సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది.

Update: 2024-07-05 09:07 GMT

దిశ,కోదాడ : లారీని వెనుక నుంచి ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో యువకుడు మృతి చెందిన సంఘటన కోదాడ మండల పరిధిలోని ఎర్రవరం సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మేళ్లచెరువు కు చెందిన కందుల వెంకట్ రెడ్డి, ఉమాల దంపతులకు చెందిన కందుల హరికిషోర్ రెడ్డి, నవీనలు ఇద్దరు పిల్లలు మేళ్లచెరువు నుంచి కోదాడలో కంప్యూటర్ నేర్చుకునేందుకు ద్విచక్ర వాహనంపై వస్తున్న క్రమంలో యర్రవరం స్టేజి సమీపంలో ఆగి ఉన్న లారీని ఢీ కొట్టడంతో హరి కిషోర్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. తన సోదరి నవీన్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. గాయపడిన మృతుని సోదరి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.


Similar News