ముంబైలో పేట వలస కూలీ మృతి...

నారాయణపేట జిల్లా కేంద్రానికి చెందిన యువకుడు ముంబాయిలో నిర్మాణ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు సుమారు 19వ ఫ్లోర్ నుంచి కింద పడి మృతి చెందాడు.

Update: 2024-07-08 12:46 GMT

దిశ, నారాయణపేట క్రైమ్: నారాయణపేట జిల్లా కేంద్రానికి చెందిన యువకుడు ముంబాయిలో నిర్మాణ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు సుమారు 19వ ఫ్లోర్ నుంచి కింద పడి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే నారాయణపేట జిల్లా కేంద్రంలోని మొనప్ప కాలనీకి చెందిన బూరెలు మల్లప్ప కొడుకు మల్లేష్(27) ముంబైలో 19వ ఫ్లోర్ నుంచి కింద పడి మరణించారు. మల్లేష్ గత పది సంవత్సరాల క్రితం ముంబై కి నిర్మాణ రంగ పనులు చేసేందుకు వలస వెళ్లాడు. ఈ క్రమంలో బోరెల్లి లోని డైసర్లో నివాసం ఉండేవాడు. సోమవారం ముంబైలోని వసయి ఏరియాలో భవన నిర్మాణ పనులు ( కట్టెలు కట్టడం) చేస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందాడు. అయితే మల్లేష్ తండ్రి గత రెండు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా తల్లి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. మల్లేష్ కు గతంలో వివాహం జరగగా పలు కారణాలతో భార్య దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకువచ్చేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.


Similar News