సూర్యాపేట జిల్లాలో తీవ్ర విషాదం.. అనుమానాస్పద స్థితిలో విద్యార్థిని మృతి

అనుమానాస్పద స్థితిలో విద్యార్థిని మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లాలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది.

Update: 2024-07-16 04:52 GMT

దిశ, వెబ్‌డెస్క్: అనుమానాస్పద స్థితిలో విద్యార్థిని మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లాలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. దోసపాడు బీసీ గురుకుల పాఠశాలలో నూతన‌కల్ మండలం మాచనపల్లి గ్రామానికి చెందిన సరస్వతి (10) అనే విద్యార్థిని ఐదో తరగతి చదువుతోంది. ఈ క్రమంలోనే బాలికకు సోమవారం జ్వరం వచ్చిందని ఉదయం ఏడు గంటలకు హస్టల్ నిర్వాహకులు తల్లిదండ్రులకు సమాచారం అందజేశారు. అయితే, సోమవారం రాత్రి తీవ్ర అస్వస్థతతో సరస్వతి మృతిచెందింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

Tags:    

Similar News