Road Accident: మేడ్చల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. భర్త కళ్లెదుటే భార్య దుర్మరణం

భర్త కళ్లెదుటే భార్య దుర్మరణం పాలైన విషాద ఘటన మేడ్చల్ పట్టణంలో చోటుచేసుకుంది.

Update: 2024-09-18 03:12 GMT

దిశ, మేడ్చల్ టౌన్: భర్త కళ్లెదుటే భార్య దుర్మరణం పాలైన విషాద ఘటన మేడ్చల్ పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పట్టణానికి చెందిన రత్నం, మాధవరావు భార్యభర్తలు. బుధవారం ఉదయం ఇద్దరూ కలిసి తమ యాక్టివా వాహనంపై వెళ్తుండగా మేడ్చల్ పోలీస్ స్టేషన్ సమీపంలో వారి వాహనాన్ని రెడీమిక్స్ వాహనం వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్య రత్నం(55) లారీ టైర్ల కిందపడి ప్రాణాలు కోల్పోగా, భర్త మాధవరావుకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు ఆతడిని పోలీసులు చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


Similar News