గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు..

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాపూర్

Update: 2024-07-05 11:03 GMT

దిశ, మెట్ పల్లి,ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాపూర్ తండాలో గుడుంబా స్థావరాలపై పోలీసులు, ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 6 లీటర్ల గుడుంబాను 90 లీటర్ల బెల్లం పానకాన్ని స్వాధీనం చేసుకొని గుడుంబా స్థావరాన్ని ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఎస్సై అనిల్ మాట్లాడుతూ.. ఎవరైనా అక్రమంగా గుడుంబా తయారీ చేసినట్లయితే వారిని బైండోవర్ చేసి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గుడుంబా కు అలవాటు పడి ఎంతో మంది కుటుంబాలను చిన్నాబిన్నం చేసుకొని చివరికి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని తెలిపారు. అంతే కాకుండా మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైనా గుడుంబా తయారీ చేస్తున్నట్లు తెలిసిన,అమ్మిన వెంటనే పోలీస్ స్టేషన్ కి సమాచారం అందించాలని కోరారు.వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని అన్నారు. ఈ తనిఖీల్లో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వినోద్ రాథోడ్, ఇబ్రహీంపట్నం ఎస్సై అనిల్, పోలీస్,ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.


Similar News