ఇన్ ఫార్మర్ నెపంతో ఇద్దరిని హతమార్చిన నక్సల్స్​

ఛత్తీస్ ఘడ్ బీజాపూర్ జిల్లా భైరామ్ ఘడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జంపే మరక గ్రామానికి చెందిన ముగ్గురు గ్రామస్తులను రెండు రోజుల క్రితం మావోలు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు.

Update: 2024-09-12 10:11 GMT

దిశ, భద్రాచలం : ఛత్తీస్ ఘడ్ బీజాపూర్ జిల్లా భైరామ్ ఘడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జంపే మరక గ్రామానికి చెందిన ముగ్గురు గ్రామస్తులను రెండు రోజుల క్రితం మావోలు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. వీరిలో ఒక విద్యార్ధి కూడా ఉన్నాడు. గురువారం ప్రజా కోర్టు నిర్వహించి అపహరించిన ముగ్గురిలో ఇద్దరిని హత్య చేసి విద్యార్థిని వదిలి వేశారు. ఇన్ఫార్మర్ నెపంతో హత్య చేసినట్లు మావోయిస్టులు ఘటనా స్థలంలో లేఖ వదిలి వెళ్లారు. 

Tags:    

Similar News