దావతే ప్రాణం తీసింది...

ముప్కాల్ మండలంలోని నాగపూర్ గ్రామానికి చెందిన గురికాడి లింబాద్రి (50 ) మద్యం తాగి కిందపడి మృతి చెందాడు.

Update: 2024-09-21 14:13 GMT

దిశ, బాల్కొండ : ముప్కాల్ మండలంలోని నాగపూర్ గ్రామానికి చెందిన గురికాడి లింబాద్రి (50 ) మద్యం తాగి కిందపడి మృతి చెందాడు. ఈ మేరకు ఎస్​ఐ బి. నరేష్ తెలిపారు. శుక్రవారం బాల్కొండ శివారులోని ఫామ్ హౌస్ లో తన సహ డైరెక్టర్లతో కలిసి లింబాద్రి దావత్ చేసుకున్నాడు. అనంతరం ఇంటికి వచ్చేందుకు కొద్ది దూరం నడవగా కళ్లు తిరిగి బైక్ పై పడి అనంతరం కిందపడ్డాడు. దాంతో బైక్ అతనిపై పడటంతో ముక్కు, కనతకు, కుడి కన్నుకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని భార్య గురికాడి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్​ఐ బి.నరేష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.  

Tags:    

Similar News