వేల్పూర్‌లో వరుస దొంగతనాలు

మండల కేంద్రంలో చిన్న చిన్న కిరాణా దుకాణాలు టార్గెట్

Update: 2024-08-03 06:12 GMT

దిశ,వేల్పూర్ : మండల కేంద్రంలో చిన్న చిన్న కిరాణా దుకాణాలు టార్గెట్ చేసుకొని దొంగలు రెచ్చిపోతున్నారు. ప్రధాన కూడలి అంబేద్కర్ చౌరస్తా వద్ద ఉన్నటువంటి వైష్ణవి కిరణ మర్చంట్ లో గత అర్ధరాత్రి దొంగలు షాప్ తాళాలు పగలగొట్టి నగదు దోచుకెళ్లారు. ఈ రోజు ఉదయం షాప్ యజమాని సంటి రవీందర్ దుకాణం తెరవాలని చూడగా తాళాలు పగిలినవి ఉన్నాయి. వెంటనే 100 నెంబర్ కి డయల్ చేసి జరిగింది చెప్పాడు. హుటాహుటిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి వివరాలు సేకరించారు.

విశేషమేమిటంటే ఇప్పుడు చోరికి గురి అయినా షాప్ ఎదురుగానే ఐదు రోజుల క్రితం సంతోష్ పాన్ షాప్ లో ఇదే తరహా దొంగతనం జరిగింది. అప్పుడు నగదు తోపాటు సిగరెట్ పేట్టలు దొంగతనం చేశారు. ఈ వరుస సంఘటనలు భయబ్రాంతులకు గురి చేస్తున్నాయని షాపు యజమానులు వాపోతున్నారు. గ్రామంలో సీసీ కెమెరాలు ఉన్న అవి పని చేయడం లేదని, అవి పని చేస్తే ఇలా వరుస దొంగతనాలు జరిగుండక పోవచ్చని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. ఈ చోరీకి గురైన దుకాణాలకు కూతవేటు దూరంలోనే పోలీస్ స్టేషన్ ఉండటం గమనార్హం.


Similar News