సిరిసిల్లలో భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది.

Update: 2024-07-29 07:10 GMT

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల పట్టణం శాంతినగర్‌కు చెందిన దూస రాజేశం-లక్ష్మి ఇద్దరు దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్దకొడుకు వేణు, కుమార్తె మౌనిక ఇద్దరికీ వివాహం కాగా చిన్న కుమారుడు వెంకటేష్ హైదారాబాద్‌లో బి-టెక్ చదువుతున్నాడు. కాగా కొద్దిరోజుల నుంచి రాజేశం రెండు కిడ్నీలు పాడై కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. బోనాల పండుగ నేపథ్యంలో పెద్దకొడుకు ఆదివారం అత్తవారింటికి వెళ్ళాడు. ఇంట్లో ఎరరూ లేని సమయం చూసి రాత్రి భార్య లక్ష్మి(50)ని చంపి రాజేశం(54) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. లక్ష్మి తలకు బలమైన గాయం అయినట్లు గుర్తించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Similar News