suicide : కుటుంబ సమస్యలతో మనస్థాపం చెంది గృహిణి ఆత్మహత్య

కుటుంబ సమస్యలతో మనస్థాపం చెందిన ఓ గృహిణి ఇంట్లో అర్ధరాత్రి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కేపీహెచ్​బీ పోలీస్​ స్టేషన్​ పరిధిలో చోటు చేసుకుంది.

Update: 2024-07-26 15:26 GMT

దిశ, కూకట్​పల్లి: కుటుంబ సమస్యలతో మనస్థాపం చెందిన ఓ గృహిణి ఇంట్లో అర్ధరాత్రి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కేపీహెచ్​బీ పోలీస్​ స్టేషన్​ పరిధిలో చోటు చేసుకుంది. కేపీహెచ్​బీ ఎస్సై లింగం తెలిపిన వివరాల ప్రకారం కేపీహెచ్​బీ కాలనీ 7వ ఫేజ్​లోని ఎంఐజీ 33 లో హేమ నందిని(27) సాఫ్ట్​వేర్​ ఇంజనీర్​ తన భర్త శ్రీధర్​, తన సోదరుడు మన్నూరు హరిబాబుతో కలిసి నివాసం ఉంటుంది. ఇదిలా ఉండగా ఆషాడ మాసం కావడంతో హేమ నందిని భర్త శ్రీధర్​ ఈ నెల 1వ తేదీన తన సొంతూరుకు వెళ్లాడు. దీంతో హేమ నందినితో పాటు ఆమె నానమ్మ ఉంటుంది. రోజు వారి మాదిరిగానే గురువారం రాత్రి భోజనం చేసిన తరువాత ఎవరి గదిలో వారు నిద్రించారు. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని ద్రావణం సేవించింది.

 హేమ నందిని ఊపిరి ఆడక ఇబ్బంది పడుతుందని  నానమ్మ హరిబాబు కుచెప్పడంతో  హుటాహుటిన హేమ నిందిని హైటెక్​సిటిలోని యశోధ ఆసుపత్రికి తరలించారు. హేమ నందిని పరీక్షించిన వైద్యులు ఆమె మృతి చెందినట్లు తెలిపారు. హేమ నందిని ఇంట్లో ఉన్న వాస్మల్​ కేష్​ కాలా నూనే తాగినట్టు వైద్యులు తెలిపారు. సంఘటన సమాచారం అందుకున్న కేపీహెచ్​బీ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఇదిలా ఉండగా కుటుంబ సమస్యలతో మనస్థాపం చెందిన హేమ నందిని ఆత్మహత్యకు పాల్పడినట్టు కుటుంబ సభ్యులు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం గాంధికి తరలించినట్టు ఎస్సై లింగం తెలిపారు.


Similar News