గంజాయి,హాష్ ఆయిల్ సరఫరా చేస్తున్న ముఠా అరెస్ట్..

గంజాయి,హాష్ ఆయిల్ సరఫరా చేస్తున్న ముఠాను అదుపులోకి

Update: 2024-09-21 13:14 GMT

దిశ,ఎల్బీనగర్ : గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకుని వారి నుంచి గంజాయి చాక్లెట్లు, హాష్ ఆయిల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎల్బీనగర్ లోని సీపీ కార్యాలయంలో రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. రాచకొండ సీపీ సుధీర్ బాబు మాట్లాడుతూ ఆంధ్ర సరిహద్దు రాష్ట్రాల నుండి గంజాయిని అడ్డదారిలో తెలంగాణ రాష్ట్రానికి తరలిస్తూ లక్షలాది రూపాయలకు విక్రయిస్తున్న ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకొని వారి నుండి రెండున్నర కేజీల హాష్ ఆయిల్ మూడున్నర కేజీల, గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.

బీహార్ రాష్ట్రం సమిష్టి పూర్ ,సీమాత్మ జిల్లాల నుండి సంతోష్ కుమార్ వీరేందర్ సింగ్ లు అక్కడ తక్కువ ధర కు కొనుగోలు చేసి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అన్నవరం నుండి తెలంగాణకు సరఫరా చేస్తూ లక్షలాది రూపాయలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. డబ్బు సంపాదనే ధ్యేయంగా ఎంచుకున్న వీరు గతంలో కూడా పలుమార్లు గంజాయి సరఫరా చేస్తూ పలు కేసులలో నిందితులుగా ఉన్నారు. వీరిపై పీడీ యాక్ట్ నమోదు చేయడం జరుగుతుందని సీపీ సుధీర్ బాబు వెల్లడించారు.


Similar News