ICC World Cup 2023: సెంచరీలతో చెలరేగిన కుశాల్ మెండిస్, సదీర.. పాక్ టార్గెట్ ఇదే
దిశ, వెబ్డెస్క్: ICC World Cup 2023లో భాగంగా హైదరాబాద్ వేదికగా పాకిస్తాన్తో జరగుతున్న మ్యాచ్లో శ్రీలంక భారీ స్కోరు చేసింది. శ్రీలంక బ్యాటర్స్లో.. కుశాల్ మెండిస్ (122), సదీర సమరవిక్రమ (108) సెంచరీలతో చెలరేగడంతో లంక స్కోరు నిర్ణీత ఓవర్లో 9 వికెట్లు కోల్పోయి 344 పరుగులు చేసింది. కుశాల్ మెండిస్ కేవలం 65 బంతుల్లోనే 13 ఫోర్లు, 4 సిక్స్లతో మెండిస్ తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. తద్వారా వన్డే ప్రపంచకప్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన శ్రీలంక ఆటగాడిగా నిలిచాడు. ఓవరాల్గా 77 బంతులు ఎదుర్కొన్న మెండిస్.. 14 ఫోర్లు, 6 సిక్స్లతో 122 పరుగులు చేసి ఔటయ్యాడు. మిగిలిన బ్యాటర్స్లో పాతుమ్ నిస్సాంక (51), ధనంజయ డి సిల్వా (25) రన్స్తో రాణించారు. పాకిస్తాన్ బౌలర్లో.. హసన్ అలీ 4 వికెట్లు తీయగా.. షాహీన్ అఫ్రిది, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, హరీస్ రవూఫ్ చెరో వికెట్ తీశారు.