ICC World Cup 2023: 'భారత్ vs పాక్‌ మ్యాచ్‌‌కు అతడు రెడీ.. కానీ 99 శాతమే'

ICC World Cup 2023లో భాగంగా రేపు పాక్‌తో జరగబోయే మ్యాచ్‌కు స్టార్‌ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ అందుబాటులో ఉంటాడని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు.

Update: 2023-10-13 14:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: ICC World Cup 2023లో భాగంగా రేపు పాక్‌తో జరగబోయే మ్యాచ్‌కు స్టార్‌ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ అందుబాటులో ఉంటాడని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ఈ నేపథ్యంలో రోహిత్ మాట్లాడుతూ.. ‘‘శుబ్‌మన్‌ గిల్‌ 99 శాతం మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడు. అయితే ఈ విషయం గురించి రేపటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటాం’’ అని రోహిత్‌ శర్మ తెలిపాడు. వన్డే ప్రపంచకప్‌ టోర్నీకి ముందు సూపర్‌ ఫామ్‌లో ఉన్న శుబ్‌మన్‌ గిల్‌.. డెంగ్యూ బారిన పడిన విషయం తెలిసిందే. అయితే గిల్‌ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నట్లు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ధ్రువీకరించాడు. కానీ.. అతడిని పాక్‌తో మ్యాచ్‌లో ఆడించాలా లేదా అన్నది శనివారమే నిర్ణయిస్తామని పేర్కొన్నాడు.


Similar News