నిర్మల్‎లో అల్లు అర్జున్..!

by  |
నిర్మల్‎లో అల్లు అర్జున్..!
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ నిర్మల్ జిల్లాకు వచ్చారు. మాజీ జడ్పీటీసీ సభ్యురాలు కల్పనా రాంరెడ్డి కుమారుడు వికాస్ రెడ్డికి అల్లు అర్జున్ మంచి మిత్రుడు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ దట్టమైన అటవీ ప్రాంతంలో మామడ మండలం గాయిద్‎పల్లి గుట్టపై ఉన్న గెస్ట్‎హౌస్‎లో బస చేశారు.

కరోనా నేపథ్యంలో రెండు రోజుల పాటు విశ్రాంతి కోసం వచ్చిన అల్లు అర్జున్ రాక విషయాన్ని గోప్యంగా ఉంచారు. కాగా ఆయన సోమవారం ఉదయం హైదరాబాద్‎కు వెళ్లారు. కవ్వాల్ అభయారణ్యంతో పాటు గాయిద్‎పల్లి, ఆరేపల్లి ఘాట్స్‎లో ఉన్న అటవీ ప్రాంతంలో ఆయన పర్యటించి ఆహ్లాదం పొందినట్లు వికాస్‎రెడ్డి తెలిపారు.

Read Also…

మహేశ్‌కు సోదరిగా విద్య?


Next Story

Most Viewed