- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
చట్టం ముందు అందరూ సమానులే.. నిజానికి అమలు జరుగుతుందా..?
by Shyam |

X
దిశ,తుంగతుర్తి: చట్టం ముందు ప్రతి ఒక్కరు సమానులేనని తుంగతుర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షులు అన్నెపర్తి జ్ఞాన సుందర్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం మానవ హక్కులపై జరిగిన అవగాహన సదస్సులో మాట్లాడారు. ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానులే అయినప్పటికీ అమలు జరగడం లేదని అన్నారు.
కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. హక్కులను గురించి ప్రశ్నించే మనం బాధ్యతలను కూడా పాటించాలని వివరించారు. కార్యక్రమంలో న్యాయవాదులు రాజారామ్, అంగన్వాడి సూపర్వైజర్ లక్ష్మి, లెక్చరర్ లింగయ్య, పార వాలంటీర్లు బొంకూరు నాగయ్య, పేర్ల నాగయ్య, ఆకారపు జయమ్మ, తదితరులు పాల్గొన్నారు.
Next Story