- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఉత్తరాంధ్రను వణికిస్తున్న భీకర గాలుల.. బాలిక దుర్మరణం

X
దిశ, ఏపీ బ్యూరో: జవాద్ తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్రలో ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. సుమారు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లాలోని వజ్రపుకొత్తూరు మండలం ఉద్దానం మెలియాపుట్టిలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఈదురు గాలుల ధాటికి ఓ కొబ్బరి చెట్టు కిందపడిపోయింది. అయితే ఆ కొబ్బరి చెట్టు గోరకల ఇందు(17) అనే బాలికపై పడటంతో తీవ్రగాయాలపాలైంది.
దీంతో కుటుంబ సభ్యులు, స్థానికులు ఆ బాలికను హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే బాలిక మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దాంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ విషయం తెలుసుకున్న మంత్రి సీదిరి అప్పలరాజు ఆస్పత్రికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యులను మంత్రి ఓదార్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
Next Story