remand : దొంగతనం కేసులో ఇద్దరు రిమాండ్

by Sridhar Babu |
remand : దొంగతనం కేసులో ఇద్దరు రిమాండ్
X

దిశ, ఇబ్రహీంపట్నం : మంచాల పోలీస్ స్టేషన్ పరిధిలో 24 జూలై 2024 రోజున రాత్రి సమయంలో ఆగాపల్లిలోని క్రషర్ మిషన్ వద్ద ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు సుమారు 5 లక్షల విలువగల టన్ను బరువైన క్రషర్ మిషన్ సామాగ్రి, స్క్రాప్ ని దొంగలించారు. క్రషింగ్ మిషన్ సూపర్వైజర్ ఫిర్యాదు మేరకు మంచాల పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా శుక్రవారం ఉదయం హయత్ నగర్

బంజారా కాలనీలో ఆలకుంట్ల గోపి, పెట్ల రాజుని అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. వారి నుండి దొంగలించిన ఇనుప సామాన్లు, క్రషర్ మిషన్ పార్ట్స్ ని రికవరీ చేసి రిమాండ్ కి తరలించారు. ఈ దొంగతనంను మొత్తం నలుగురు వ్యక్తులు ఆలకుంట్ల గోపి, బంజర కాలనీ, పెట్ల రాజు, దేవరకొండ, దండుగుల శ్రీను, ఇరగడిండ్ల వీరబాబు కోదాడకు చెందిన వారు చోరీ చేసినట్టు తెలిపారు.



Next Story