- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మద్యం తాగొద్దని మందలించిన తండ్రిని హత్య చేసిన తనయుడు
దిశ,దౌల్తాబాద్ : మండలంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. మద్యానికి బానిసై జులాయిగా తిరుగుతున్నాడని కొడుకును మందలించాడు తండ్రి. దీంతో కొడుకు తండ్రిపై దాడి చేసి హత్య చేశాడు. ఈ ఘటన మండల పరిధిలోని హైమద్ నగర్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన పఠాన్ ఫారూఖ్ (35) తాగుడుకు బానిసై తల్లిదండ్రులను డబ్బులు ఇవ్వాలని నిత్యం వేధించేవాడు. ఈ క్రమంలోనే గురువారం ఫారుక్ తాగేందుకు డబ్బు ఇవ్వమని వేధించడం మొదలుపెట్టాడు.
అందుకు తండ్రి వలీఖాన్ (60) కోపంతో నిరాకరించగా వాగ్వాదానికి దిగాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన ఫారూఖ్ కత్తితో తండ్రిని పొడిచాడు. తీవ్రగాయం కావడంతో వలీఖాన్ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఏసీపీ పురుషోత్తం రెడ్డి, సీఐ లతీఫ్ , ఎస్సై శ్రీరామ్ ప్రేమ్ దీప్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై శ్రీరామ్ ప్రేమ్ దీప్ తెలిపారు. వలీఖాన్ మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. నింధితుడు పఠాన్ ఫారూఖ్ ను రిమాండ్ కు తరలించారు.