పాత కక్షలతో యువకుడిపై దాడి..

by Vinod kumar |
పాత కక్షలతో యువకుడిపై దాడి..
X

దిశ, ఝరా సంగం: పాత కక్షలతో యువకుడిపై దాడి చేసిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పాత కక్షలతో ఇరువర్గాల మధ్య జరిగిన గొడవలో గొడ్డళ్లు, ఇనుప రాడ్లతో కొట్టుకున్నారు. గ్రామానికి చెందిన బండి శంకర్‌పై బండి జనార్ధన్‌లు ఇనుప రాడ్లులతో దాడి చేసుకున్నారు. ఈ గొడవలో శంకర్ ఎడమ చేయి కాలుకు మూడు చోట్ల కత్తిపోట్లు పడ్డాయి. దీంతో తీవ్రంగా గాయపడ్డ శంకర్‌ను 108 వాహనంలో జహీరాబాద్ ఆసుపత్రికి తరలించారు. గతంలో సైతం రెండు కుటుంబాలు గొడవ పడి కేసు పెట్టుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. బాధితులపై కేసు నమోదు చేశామని ఝరాసంగం ఎస్సై రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు.

Advertisement

Next Story