అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి..

by Sumithra |
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి..
X

దిశ, కూకట్​పల్లి : బాలానగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని పంచశీల కాలనీ సమీపంలోని ఐడీపీఎల్​ అడవిలో ఆదివారం ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. బాలానగర్​ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మంకు చెందిన కాలే దినేష్ ​(32) గత కొన్ని సంవత్సరాలుగా తన కుటుంబంతో రంగరెడ్డినగర్​, పంచశీల కాలనీలో నివాసం ఉంటున్నాడు.

దినేష్​ రాపిడో, స్విగ్గి డెలివరీ బాయ్​గా పని చేస్తుండే వాడు. ఆదివారం పంచశీల కాలనీ సమపంలోని ఐడీపీఎల్​ అడవిలోని ఖాళీ ప్రదేశంలో దినేష్​ మృతదేహం లభ్యమయింది. దినేష్​ ముఖం, తల భాగంలో గాయాలతో రక్తం మడుగులో పడి ఉండటంతో దినేష్​ను ఎవరైనా హత్య చేసి ఉండవచ్చు అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దినేష్​ భార్య జ్యోతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు బాలానగర్​ సీఐ నవీన్​ కుమార్​ తెలిపారు.

Advertisement

Next Story