- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రూ. 54 లక్షల నగదు స్వాధీనం
దిశ, కూకట్పల్లి : ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించకుండా, సరైన పత్రాలు లేకుండా 54 లక్షల రూపాయల నగదును తరలిస్తున్న ఇటాచీ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ వాహనాన్ని, నగదు తరలిస్తున్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్వాధీనం చేసుకున్నారు. భాగ్యనగర్ కాలనీలోని అల్లూరి కాంప్లెక్స్ వద్ద బాలానగర్ ఎస్ఓటీ, కూకట్పల్లి పోలీసులు సంయుక్తంగా వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా ఇటాచీ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ వాహనంలో 54 లక్షల 52 వేల 488 రూపాయల నగదును
పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనంలో తరలిస్తున్న నగదుకు సంబంధించిన ఎటువంటి పత్రాలు లేక పోవడంతో ఎన్నికల నియమావళిని అతిక్రమించినట్టు పోలీసులు కేసు నమోదు చేసుకుని నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇటాచీ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్కు చెందిన వాహనంలో సెక్యూరిటీ సిబ్బంది మొహ్మద్ ఖలీల్ (21) కష్టోడియన్ పి. నగేష్(22) లను పోలీసులు విచారించగా పలు ఏటీఎంలలో నగదును జమ చేసేందుకు వెళ్తున్నట్టు తెలిపారు. కాగా ఎటువంటి ధ్రువీకరణ పత్రాలు లేక పోవడంతో నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.