కూతురు ప్రేమ పెళ్లి.. మనస్థాపంతో తండ్రి ఆత్మహత్య

by Aamani |
కూతురు ప్రేమ పెళ్లి.. మనస్థాపంతో తండ్రి ఆత్మహత్య
X

దిశ,దుబ్బాక : కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందని తీవ్ర మనస్థాపానికి గురైన ఓ తండ్రి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన దుబ్బాక మండలం అచ్చు మాయ పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై వి.గంగరాజు తెలిపిన వివరాల ప్రకారం దుబ్బాక మండలం అచ్చుమాయి పల్లి గ్రామానికి చెందిన సోమారపు రేణవ్వ, లింగం దంపతుల కూతురు దీక్ష ఇటీవల కులాంతర వివాహం చేసుకుంది. లింగం వరి మడికి నీరు పెట్టొస్తానని ఆదివారం సాయంత్రం ఇంటి నుంచి పొలం వద్దకు వెళ్లాడు. లింగం ఇంటికి ఎంతకీ రాకపోవడంతో భార్య రేణవ్వ భర్తకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి గ్రామస్తుల సహాయంతో పొలం వద్దకు వెళ్లింది. అక్కడ వెళ్లి చూసే సరికి లింగం పొలంలోని చెట్టుకు ఉరేసుకుని కనిపించాడు. ప్రేమ వివాహం చేసుకున్న కూతురు విషయంలోనే ప్రతి రోజు మదనపడుతుండే వాడని రేణవ్వ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొందని ఎస్సై గంగరాజు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed