రోడ్డు ప్రమాదంలో 25 మందికి గాయాలు..

by Sumithra |
రోడ్డు ప్రమాదంలో 25 మందికి గాయాలు..
X

దిశ, సదాశివపేట : ఆగి ఉన్న లారీని కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీకొన్న సంఘటన సదాశివపేట మండలం మద్దికుంట జాతీయ రహదారి పై సోమవారం తెల్లవారుజామున జరిగింది. జహీరాబాద్ నుంచి వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు మద్దికుంట వద్ద ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తూ 25 మందికి గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం సంగారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మహేష్ గౌడ్ తెలిపారు.

Advertisement

Next Story