శంషాబాద్‌లో భారీగా రేషన్ బియ్యం పట్టివేత

by  |
శంషాబాద్‌లో భారీగా రేషన్ బియ్యం పట్టివేత
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: జిల్లాలో భారీగా అక్రమ రేషన్ బియ్యం పట్టుబడింది. గత కొన్ని రోజులుగా గుట్టుచప్పుడు కాకుండా 8 టన్నుల రేషన్ బియ్యాన్ని శంషాబాద్ నుంచి డీసీఎంలో కర్ణాటకలోని బీదర్‌కు తరలిస్తున్నారన్న సమాచారం రావడంతో ఎస్ఓటీ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని శాతంరాయ్ శ్రీరామ దర్మకాంఠ వద్ద ఎస్ఓటీ సీఐ వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న డీసీఎంను పట్టుకున్నారు. నిందితుడు మహమ్మద్ ఫరూక్‌ను అరెస్టు చేసి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీసులకు అప్పగించారు.



Next Story

Most Viewed