- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
గడ్చిరౌలిలో భారీ ఎన్కౌంటర్.. నెత్తురోడిన దండకారణ్యం

X
దిశ, వెబ్డెస్క్: మహారాష్ట్రలోని గడ్చిరౌలి జిల్లాలో కాల్పులమోత కలకలం రేపింది. భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో 13 మంది మావోయిస్టులు చనిపోయారు. గడ్చిరౌలి జిల్లాలోని ఈటపల్లి అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా.. మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఇరువురు కాల్పులు జరిపగా.. 13 మంది మావోయిస్టులు మృతి చెందారని గడ్చిరౌలి డీఐజీ సందీప్ పాటిల్ తెలిపారు. తప్పించుకున్న మావోయిస్టుల కోసం ఈటపల్లి అటవీ ప్రాంతంలో పోలీసుల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు.
Next Story