కడప చేరుకున్న జగన్

by  |
కడప చేరుకున్న జగన్
X

దిశ, ఏపీ బ్యూరో: రెండ్రోజుల పర్యటన నిమిత్తం సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మంగళవారం సాయంత్రం కడప చేరుకున్నారు. విజయవాడలోని గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయల్దేరిన సీఎం కడప ఎయిర్‌పోర్టుకు చేరుకోగా… జిల్లా ఇంచార్జ్ మంత్రి ఆదిమూలపు సురేష్, విప్ కొరముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, రవీంద్రనాధ్ రెడ్డి, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, కలెక్టర్ హరికిరణ్, కర్నూల్ రేంజ్ డీఐజీ ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన ఇడుపులపాయకు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా బయల్దేరారు. వైఎస్సార్‌ జయంతిని పురస్కరించుకుని బుధవారం ఇడుపులపాయలో వైఎస్సాఆర్‌ ఘాట్‌ వద్ద సీఎం వైఎస్‌ జగన్‌, ఆయన సతీమణి భారతి నివాళులర్పించనున్నారు. అనంతరం ట్రిపుల్ ఐటీ వద్ద వైఎస్సార్‌ విగ్రహావిష్కరణతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను జగన్‌ ప్రారంభించనున్నారు.



Next Story

Most Viewed