రైలు కింద పడి యువకుడు మృతి

by Sumithra |   ( Updated:2020-05-25 05:46:08.0  )
రైలు కింద పడి యువకుడు మృతి
X

దిశ, నల్లగొండ: అతను 24 ఏళ్ల యువకుడు. ఇంకా జీవితం ఎంతో చూడాల్సి ఉంది. కానీ, ఏమైందో ఏమో.. కన్నవారికి పుత్రశోకాన్ని మిగుల్చుతూ.. కానరానిలోకాలకు తరలివెళ్లాడు. యాదాద్రి భువనగిరి జిల్లా బసాపురం గ్రామానికి చెందిన అన్నంపట్ల వంశీ(24) రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. భువనగిరి-రాయగిరి రైల్వే స్టేషన్ల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది.

Next Story

Most Viewed