చాక్లెట్ ఆశచూపి… రిజర్వాయర్‌లో నెట్టేశాడు

by srinivas |
చాక్లెట్ ఆశచూపి… రిజర్వాయర్‌లో నెట్టేశాడు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇద్దరు పిల్లలకు చాక్లెట్ ఆశచూపి తీసుకెళ్లిన ఓ యువకుడు వారిని కాలువలో తోసేశాడు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం జిల్లా మార్తాడు గ్రామానికి చెందిన శశిధర్, మోక్షాజ్ఞ అనే ఇద్దరు పిల్లలను సమీప బంధువు రాము… చాక్లెట్ కోనిస్తానని తీసుకెళ్లి వారిని హంద్రీనీవా కాలువలో పడేశాడు. అనంతరం ఎవరికీ కనిపించకుండా నిందితుడు పారిపోయాడు. కొద్దిసేపటి తర్వాత కూడేరు సమీపంలో కొన ఊపిరితో ఉన్న శశిధర్‌ను కాపాడిన తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించగా.. మరో బాలుడు మోక్షాజ్ఞ మృతదేహం జీడిపల్లి రిజర్వాయర్ దగ్గర పోలీసులు గుర్తించారు. అయితే ఆస్తి తగాదాలతోనే ఈ ఘటన జరిగిటనట్లు తెలుస్తోంది. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed