బాలికను గర్భవతిని చేసి, మరో అమ్మాయితో పెళ్లి 

by  |
బాలికను గర్భవతిని చేసి, మరో అమ్మాయితో పెళ్లి 
X

దిశ, వెబ్ డెస్క్: రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలంలో దారుణం జరిగింది. ఓ యువకుడు బాలికను గర్భవతిని చేసి, మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలిక స్థానిక ఉన్నత పాఠశాలలో 9వ తరగతి పూర్తి చేసింది. అదే గ్రామానికి చెందిన శవ్వ మహేశ్‌ ఏడాదిగా ప్రేమిస్తున్నానని బాలిక వెంటపడేవాడు. మాట్లాడకుంటే చంపేస్తానని బెదిరించి, ఏడాది కాలంగా ఆమెపై లైంగికదాడికి సైతం పాల్పడ్డాడు.

ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చింది. ప్రస్తుతం ఆమె ఆరు నెలల గర్భవతి. గర్భం దాల్చినట్టు తెలియడంతో ఈ విషయం ఎవరికి చెప్పొద్దని బెదిరించి రెండు నెలలు మీ అమ్మమ్మ వాళ్ల ఇంట్లో ఉండాలని చెప్పి డబ్బులు ఇచ్చి పంపించాడు. రెండు నెలల తర్వాత బాలిక అమ్మమ్మ ఇంటి నుంచి తిరిగి వచ్చేసరికి మహేశ్‌కు మరో అమ్మాయితో పెళ్లైందని తెలిసింది.

ఈ విషయంపై అతడిని ప్రశ్నించగా… మీ తల్లిదండ్రులతో మాట్లాడి నిన్ను కూడా పెళ్లి చేసుకుంటానని, ముందు అబార్షన్‌ చేయించుకోవాలని నమ్మించాడు. 18న ఓ ప్రైవేట్ క్లినిక్‌కు తీసుకెళ్లగా… అబార్షన్ చేయించడం కుదరలేదు. బాలికను గమనించిన తల్లి నిలదీయడంతో అసలు విషయం బయట పడింది. బాలికను పెళ్లి చేసుకొని తమకు న్యాయంచేయాలంటూ బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు మహేశ్‌ ఇంటి ఎదుట టెంట్‌ వేసి నిరసన చేపట్టారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసినట్టు సీఐ సైదులు వెల్లడించారు.


Next Story

Most Viewed