నూతన్ నాయుడిపై పెందుర్తిలో ఫిర్యాదు

by  |
నూతన్ నాయుడిపై పెందుర్తిలో ఫిర్యాదు
X

దిశ, వెబ్‌డెస్క్: బిగ్‌బాస్ 2 ద్వారా అందరికీ పరిచయం అయిన నూతన్ నాయుపై ఓ వ్యక్తం సంచలన ఆరోపణలు చేశారు. నూతన నాయుడు తనకు శిరోముండనం చేసినట్టు (గుండు కొట్టించినట్టు) పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాళ్లోకి వెళితే… ప్రస్తుతం విశాఖ పట్టణం జిల్లా పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధి సుజాతనగర్‌లో నూతన నాయుడు నివాసముంటున్నారు. గత నాలుగు నెలలుగా నూతన నాయుడు ఇంట్లో దళిత యువకుడు శ్రీకాంత్ పని చేస్తున్నారు.

రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతుండంతో నూతన నాయుడు ఇంట్లో శ్రీకాంత్ చెప్పకుండా పని మానేసాడు.

దీంతో నూతన్ నాయుడు శ్రీకాంత్‌కు ఫోన్‌ చేసి సెల్ ఫోన్ పోయిందని, దాని గురించి మాట్లాడాలని, ఇంటికి రమ్మని పిలిచాడని, ఇంటికి వచ్చిన శ్రీకాంత్‌కు ఆయన శిరోముండనం చేశాడని (గుండు కొట్టించడం) శ్రీకాంత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీకాంత్‌ ఫిర్యాదు మేరకు సంఘటనపై పెందుర్తి పోలీసులు విచారణ చేపట్టారు.


Next Story