అందంగా లేనని యువకుడి ఆత్మహత్య

by  |
అందంగా లేనని యువకుడి ఆత్మహత్య
X

దిశ, ఏపీ బ్యూరో: అందంగా లేనన్న ఆత్మన్యూనతతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే… శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలంలోని మాణిక్యపురంకి చెందిన సునీల్‌ నాయక్‌ (20) స్థానిక కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. సునీల్‌ ముఖంపై చిన్ననాటి నుంచి మచ్చలు ఉండేవి. వాటిని తగ్గించుకునేందుకు మార్కెట్‌లో అందుబాటులో ఉన్న క్రీములన్నీ వాడాడు. అయినా ఫలితం లేకపోయింది. వైద్యులను సంప్రదించినా ఉపయోగం లేకపోయింది. దీంతో కాలేజీకి వెళ్లే సమయంలో ముఖంపై కర్చీఫ్‌ కప్పుకునే వెళ్లేవాడు. అందంగా లేకపోవడం శాపంగా భావించాడు. దీంతో అందంగా లేకపోవడంతో అంతా చులకనగా చూస్తున్నారని, భవిష్యత్‌లో కూడా చులకనగానే చూస్తారని భావించాడు. దీంతో తీవ్ర కుంగుబాటుకులోనయ్యాడు. ఈ ఆవేదనతోనే ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కరోనా పరీక్షలు నిర్వహించిన అనంతరం పోస్టుమార్టం చేస్తామని వైద్యులు తెలిపారు.


Next Story

Most Viewed