- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, ములుగు: ములుగు జిల్లాలో దారుణం జరిగింది. పురుగుల మందుతాగి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జిల్లాలోని వెంకటాపూర్లో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్ఐ భూక్య నరహరి కథనం ప్రకారం..మండల కేంద్రానికి చెందిన మద్దూరి మహేష్ (22) తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. దీంతో అప్పటి నుంచి అతని తల్లి దుగ్గొండి మండలంలోని దేశాయిపల్లి గ్రామంలో ఉంటున్న తన అమ్మమ్మ దగ్గరికి వెళ్ళింది.
రెండు నెలల కిందట స్వగ్రామం వెంకటాపూర్కు తల్లి తిరిగి రావడంతో మహేష్, అతడి తమ్ముడు ప్రశాంత్ కలిసే ఉంటున్నారు. అయితే, నెలరోజుల కిందట అతని తల్లి తిరిగి అమ్మమ్మ వద్దకు వెళ్లిపోళింది. దీంతో మనస్తాపం చెందిన మహేష్ మండల కేంద్రం శివారులోని ప్లాట్లలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అదే సమయంలో పొలం వద్దకు వెళ్లిన ఉపసర్పంచ్ జంగిలి సంపత్ అపస్మారక స్థితిలో ఉన్న మహేష్ను గుర్తించి ఆస్పత్రికి తరలించాడు. పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. మృతుని సోదరుడు ప్రశాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.