- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
స్పందన లేదు.. నోట్లో నుంచి నురగలొస్తున్నయ్

దిశ ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం జిల్లాకు చెందిన యువ జంట కొడైకెనాల్లో బలవన్మరణానికి పాల్పడింది. ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెం గ్రామానికి చెందిన బోజడ్ల గోపీకృష్ణ(26)ఆయన భార్య భద్రాచలం సమీపంలోని చోడవరం గ్రామానికి చెందిన ఏపూరి నందిని(26) కొడైకెనాల్లోని ఓ ఐటీ కంపెనీలో పని చేస్తున్నారు. 2018లో హైదరాబాద్లో ప్రేమ వివాహం చేసుకున్న వీరు కొడైకెనాల్లోని అన్నయ్ థెరెస్సా యూనివర్సిటీ సమీపంలోని ఓ ఇంట్లో ఏడాది కాలంగా నివాసముంటున్నారు.
కాగా శుక్రవారం తెల్లవారుజామున కిరాణా సరుకులు సరఫరా చేసే యువకుడు వారి ఇంటికి వెళ్లగా తలుపులు తీయలేదు. ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో లోపలికి చూశాడు. దంపతులిద్దరూ నోట్లో నుంచి నురగలు కక్కి ఉండటాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వచ్చి పరిశీలించగా అప్పటికే వారు చనిపోయి ఉన్నారు.
కాగా గోపీకృష్ణ దంపతులు కొన్ని నెలలుగా ఆర్థిక ఇబ్బందులతో బాధ పడుతున్నారని విచారణలో ఆ యువకుడు పోలీసులకు తెలిపాడు. గత 3 నెలలుగా జీతాలు సరిగా రావడం లేదని చెప్పినట్లు వివరించాడు. అయితే దంపతులిద్దరూ కొద్దికాలంగా ఆస్ట్రేలియా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆ ప్రయత్నాలు ఫలించడంలేదన్న బాధతో ఉన్నట్లు తెలిసింది. కాగా వీరి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చి కేసు దర్యాప్తు చేస్తున్నారు.