రాజ్యసభలో వైసీపీ ఎంపీల ఆందోళన..

by srinivas |
vijay sai reddy news
X

దిశ,ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఎంపీలు పార్లమెంటులో పోరాటం చేస్తున్నారు. ప్రత్యేకహోదాపై చర్చను చేపట్టాలని కోరుతూ రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడికి వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి మంగళవారం కూడా నోటీసును ఇచ్చారు. రాజ్యసభలో నిర్వహించే ఇతర వ్యవహారాలన్నింటినీ పక్కన పెట్టి రూల్-267 కింద ఏపీకి ప్రత్యేకహోదా అంశంపై చర్చను ప్రారంభించాలని కోరారు. అయితే ఇప్పటికిప్పుడే దీనిపై చర్చించలేమని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. దీంతో వైసీపీ ఎంపీలు నిరసన తెలిపారు. ప్లకార్డులు పట్టుకుని పోడియం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో తెలియజేశారు.



Next Story

Most Viewed