సీఎం జగన్‎కు వైసీపీ ఎంపీ లేఖ..!

by  |
సీఎం జగన్‎కు వైసీపీ ఎంపీ లేఖ..!
X

దిశ, వెబ్‎డెస్క్: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖ రాశారు. సెప్టెంబర్ 14 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో అన్ని పార్టీల ఎంపీలతో వర్చువల్ సమావేశం నిర్వహించాలని లేఖలో పేర్కొన్నారు. సభలో ఏయే అంశాలు లేవనెత్తాలి, కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన వాటిపై చర్చించాలన్నారు. గతంలో ముఖ్యమంత్రులు సమావేశాలకు ముందు ఎంపీలతో సమావేశం ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తుందని రఘురామ కృష్ణరాజు గుర్తు చేశారు. రాష్ట్ర శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని సమవేశాన్ని నిర్వహించాలని కోరారు.


Next Story