అంగుళం ఆక్రమించినా విడిచిపెట్టం…

by  |
ycp mp vijaya sai reddy
X

దిశ వెబ్ డెస్క్:
ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే సహించేది లేదని ఎంపీ విజయ సాయి రెడ్డి అన్నారు. మీ ఆరోగ్యం మీ చేతుల్లో అనే పుస్తకాన్ని ఆయన శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…కరోనా వైరస్ కట్టడికి అత్యంత శ్రద్దతో సీఎం జగన్ పనిచేస్తున్నారని ఆయన అన్నారు. అందుకే రాష్ట్రంలో అత్యధికంగా కరోనా టెస్టులు నిర్వహిస్తున్నామని అన్నారు. కరోనాకు తీసుకోవాల్సి న జాగ్రత్తల గురించి ఈ పుస్తకంలో వివరించారని తెలిపారు. ప్రతి కుటుంబానికీ ఈ పుస్తకాన్ని అందజేస్తామన్నారు. ప్రభుత్వ భూములను పరిరక్షిస్తామని ఆయన వెల్లడించారు. ప్రభుత్వ భూమిని అంగుళం ఆక్రమించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


Next Story

Most Viewed