విజయసాయి రెడ్డి ట్వీట్ లో ఏమన్నారంటే …

by  |
విజయసాయి రెడ్డి ట్వీట్ లో ఏమన్నారంటే …
X

దిశ వెబ్ డెస్క్: ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి1 నుంచి సమగ్ర భూ సర్వే నిర్వహించనున్నట్టు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. ట్యాంపర్ ఫ్రూఫ్ డాటాతో చేస్తుండటంతో అన్ని రకాల భూ వివాదాలకు ముగింపు పలకనున్నట్టు ఆయన ట్వీట్ చేశారు. ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా, అత్యంత పారదర్శకంగా పనిచేసేందుకు జగన్ కట్టుపడి ఉన్నారని ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు. కాగా భూ సర్వే పైలెట్ ప్రాజెక్ట్ పై ఏపీ సీఎం జగన్ నిన్న సమీక్షా సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. భూ సర్వేను 2023 ఆగస్టు నెలలోగా పూర్తి చేయాలని అదికారులు ఆదేశించారు. వివాదాల పరిష్కారానికి మొబైల్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి సమస్యలను ఎక్కడికక్కడే పరిష్కరించాలని అధికారులకు సూచించిన సంగతి తెలిసిందే.


Next Story

Most Viewed