వచ్చేసారి 151కంటే ఎక్కువ సీట్లు గెలుస్తాం

by  |
వచ్చేసారి 151కంటే ఎక్కువ సీట్లు గెలుస్తాం
X

దిశ, ఏపీ బ్యూరో: జగన్ సర్కార్ చేస్తున్న మంచి పనులతో రాష్ట్రమంతా మంచి మర్యాద ఉందని, వచ్చే ఎన్నికల్లో 151కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని వైసీపీ ఎంపీ కోటగిరి శ్రీధర్ వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతిలో రాజధాని ఏర్పాటుకు ముందే టీడీపీ నేతలు నాలుగు వేల ఎకరాలకు అగ్రిమెంట్ చేసుకున్నారని, దీనిపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అక్కడ టీడీపీ నేతలు, సుప్రీంకోర్టు జడ్జిలు సైతం భూములు పొందారన్నారు. ప్రభుత్వం చేసే ప్రతి పనికి కోర్టులు అడ్డుపడుతున్నాయన్న ఎంపీ శ్రీధర్.. గతంలో ముగ్గురు వైసీపీ ఎంపీలను తీసుకుంటే ఇప్పుడు టీడీపీకి ముగ్గురే మిగిలారని పేర్కొన్నారు.


Next Story